BRS manifesto : ఆసరా పింఛన్ రూ. 5 వేలు.. రైతుబంధు రూ. 16 వేలు

BRS manifesto :  ఆసరా పింఛన్ రూ.  5 వేలు.. రైతుబంధు రూ. 16 వేలు

అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్  మేనిఫెస్టో రిలీజ్ చేశారు.  చెప్పిన హామీలను ఐదారు నెలల్లోనే ఆమలు చేస్తామన్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి  LIC ద్వారా  5 లక్షల కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు.  వచ్చే బడ్జెట్ లోనే దీనిని అమలు చేస్తామన్నారు.  దీనివలన  93 లక్షల మందికి లబ్థి చేకూరనుందని తెలిపారు.

మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు  

  • రైతుబంధు 16 వేలకు పెంపు.. మొదటి సంవత్సరం రూ.12వేల నుంచి మెదలు
  • దివ్యాంగుల పెన్షన్లు రూ.6వేలకు పెంపు.. (మార్చి తర్వాత రూ.5వేలు చేసి.. ప్రతి సంవత్సరం 300కి పెంచుతూ ఆరు వేలకు)
  • ఆసరా పెన్షన్లు రూ.5వేలకు పెంపు  (మార్చి తర్వాత పెన్షన్‌ను రూ.3వేలు చేసి. ప్రతి సంవత్సరం రూ. 500 పెంచుతూ ఐదో సంవత్సరం నిండేనాటికి రూ.5వేలకు)
  • తెలంగాణ అన్నపూర్ణ ప‌థ‌కం కింద ప్రతి రేష‌న్ కార్డు హోల్డర్‌కు స‌న్నబియ్యం
  • రైతుబీమా తరహాలో ప్రజలందరికీ ఉచిత బీమా.. కేసీఆర్‌ బీమా- ప్రతి ఇంటికీ ధీమా అనే పథకంతో ఎల్ఐసీ ద్వారా బీమా  93 లక్షల కుటుంబాలకు బీమా సదుపాయం
  • అర్హులైన పేద మహిళలకు 400కే గ్యాస్‌ సిలిండర్‌..అక్రిడేషన్ జర్నలిస్టులకు కూడా 
  • సౌభాగ్యలక్ష్మీ పథకం కింద పేద మహిళలకు రూ.3వేల గౌరవ భృతి
  • హైదరాబాద్ లో మరో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు
  • ఆరోగ్యశ్రీ రూ. 15 లక్షలకు పెంపు.. 
  • జర్నలిస్టులకు ఉద్యోగుల తరహాలో  హెల్త్  స్కీమ్ 
  • అగ్రవర్ణ పేదలకు నియోజకవర్గానికి కొత్తగా 119గురుకులాలు ఏర్పాటు
  • మహిళా స్వశక్తి గ్రూప్ లకు సొంత భవనాలు
  • అసైన్డ్ లాండ్ లపై పూర్తి సర్వహక్కులు