గెల్లు శ్రీనివాస్‌కు బీఫాం.. ఎన్నికల ఖర్చుకు రూ.28లక్షల చెక్కు

గెల్లు శ్రీనివాస్‌కు బీఫాం.. ఎన్నికల ఖర్చుకు రూ.28లక్షల చెక్కు

హుజూరాబాద్ ఉప ఎన్నిక  బరిలో నిలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్  యాదవ్ కు ఆ పార్టీ బీ ఫాం ఇచ్చింది. ఈ మేరకు గురువారం సీఎం కేసీఆర్ గెల్లుకు బీ ఫాం అందజేశారు. ఎన్నికల ఖర్చు కోసం రూ.28లక్షల చెక్కును పార్టీ ఫండ్ గా ఆయనకు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి,మాజీ మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. అక్టోబర్ 30న ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ప్రచారంలో ఉన్నారు. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.