జైపాల్ రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

జైపాల్ రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్రసంతాపాన్ని వ్యక్తం చేశారు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా, కేంద్రమంత్రిగా దేశానికి ఆయన చేసిన సేవలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న జైపాల్ రెడ్డి.. ఈనెల 20వ తేదీన గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ… ఈ రోజు పొద్దున కన్నుమూశారు.