
మద్నూర్, వెలుగు: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల కోసం వేదికలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని ఎమ్మెల్యే హన్మంత్షిండే పేర్కొన్నారు. శుక్రవారం ఆయన జుక్కల్ మండలం హంగర్గలో రైతు వేదికను ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ లీడర్లు, రైతులు పాల్గొన్నారు.