హైదరాబాద్: రాష్ట్రం లోని ప్రతి గ్రామంలో ‘‘తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం’’ ఏర్పాటు చేయాలని సీఎం కేసిఆర్ నిర్ణయించారు. బుధవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 19వేల గ్రామాలు, 5 వేల వార్డులు ఉండగా... వాటన్నింటిలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
గ్రామాల్లో క్రీడలను నిర్వహించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19వేల గ్రామాలు, 5వేల వార్డులు, మొత్తంగా 24 వేల ‘‘గ్రామీణ క్రీడా కమీటీల’’ను ఏర్పాటు చేయాలని సీఎం తెలిపారు. రాష్ట్ర అవిర్భావ దినోత్సవం నాడు ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించాలన్నారు.
— Telangana CMO (@TelanganaCMO) May 18, 2022
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జూన్ 2న రాష్ట్ర అవిర్భావ దినోత్సవం సందర్భంగా గతంతో ఎంపిక చేసిన గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించాలన్నారు. భవిష్యత్తు తరాలు శారీరక ధారుడ్యం, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు తోడ్పడేందుకు ఈ క్రీడా ప్రాంగణాలు ఉపయోగపడతాయన్నారు. క్రీడల వల్ల ఉపాధి అవకాశాలు కూడా పుష్కలంగా లభిస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు. వీలైనంత త్వరగా క్రీడా ప్రాంగణాల నిర్మాణాలు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
భవిష్యత్తు తరాలు శారీరక ధారుడ్యం, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు తోడ్పడే విధంగా తెలంగాణలోని ప్రతి గ్రామంలో ‘‘తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం’’ ఏర్పాటు చేయాలని సీఎం శ్రీ కేసీఆర్ నిర్ణయించారు.
— Telangana CMO (@TelanganaCMO) May 18, 2022
మరిన్ని వార్తల కోసం...