హైదరాబాద్: సికింద్రాబాద్ బోయిగూడ టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో బీహార్ కు చెందిన 11మంది కూలీలు మృతి చెందారు. వీరి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికీ రూ 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను సీఎం కేసిఆర్ ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన బీహార్ వలస కార్మికుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేష్ కుమార్ను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇవి కూడా చదవండి