అగ్ని ప్రమాదం పట్ల సీఎం దిగ్భ్రాంతి

అగ్ని ప్రమాదం పట్ల సీఎం దిగ్భ్రాంతి

హైదరాబాద్: సికింద్రాబాద్ బోయిగూడ టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో బీహార్ కు చెందిన 11మంది కూలీలు మృతి చెందారు. వీరి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి  ఒక్కొక్కరికీ రూ 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను సీఎం కేసిఆర్ ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన బీహార్ వలస కార్మికుల  మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేష్ కుమార్ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

ఐటీ రిటర్న్‌‌ను ఎలా ఫైల్ చేయాలంటే..

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్