హైకోర్టు ఆదేశాలతో ఆలోచనలో పడ్డ కేసీఆర్.. అధికారులతో సమీక్ష

హైకోర్టు ఆదేశాలతో ఆలోచనలో పడ్డ కేసీఆర్.. అధికారులతో సమీక్ష

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సీఎం కేసీఆర్ ఆలోచనలో పడ్డారు. రిజిస్ట్రేషన్ల సమయంలో ఆధార్ సహా పాన్, కులం, సోషల్ స్టేటస్, ఫోన్ నెంబర్, ఫ్యామిలీ మెంబర్ల వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడగొద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులతో శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి హైకోర్టు ఆదేశాల కాపీ ఇంకా ప్రభుత్వానికి అందలేదు. అందిన తర్వాత దానిపై కూలంకషంగా చర్చించి తగు నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లడమా ? లేదంటే తగు విధమైన విధివిధానాలు రూపొందించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టడమా ? అనే అంశంపై రెవెన్యూ, న్యాయ శాఖల నిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

For More News..

ఒక్క కార్పొరేటర్‌ని కెలికెతే.. వందమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కెలుకుతం

500 ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద గుడి

మీరు నీళ్లు ఎలా తాగుతున్నారు.. అలా తాగితే మాత్రం డేంజరే..