కేసీఆర్ నియంతృత్వ, కుటుంబ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. అదిలాబాద్ లో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతిపక్షాలను తొక్కేసి రాష్ట్రంలో ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉండాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల విజయమే మోడీ సుపాలనకు నిదర్శనమన్నారు. బీజేపీకి బలమైన కార్యకర్తలున్నారన్న వివేక్..తమ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలే కోరుకుంటున్నారని చెప్పారు. బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. కేసీఆర్ పాపులారిటీ తగ్గడంతోనే పీకే ను సలహాదారునిగా నియమించుకున్నారని ఎద్దేవా చేశారు. అబద్ధాల చక్రవర్తి అనే బిరుదు కేసీఆర్ కి బాగా సెట్ అవుతుందన్నారు. అవినీతి, అప్పులో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని..60వేల కోట్ల అప్పులను 5 లక్షల కోట్ల అప్పులుగా మార్చిన ఘనత టీఆర్ఎస్ కే దక్కుతుందని మండిపడ్డారు. మోడీని గద్దె దించుతానని మాట్లాడుతూ కేసీఆర్ ప్రతిసారి అభాసుపాలవుతున్నారని దుయ్యబట్టారు. కేంద్రానికి సంబంధించిన చాలా పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాల్లో వేలకోట్లు దండుకున్నారని ఆరోపించారు.
అవినీతి, అప్పులో తెలంగాణ నెంబర్ వన్
- తెలంగాణం
- May 28, 2022
లేటెస్ట్
- ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య!
- సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి పత్రం
- జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో