అవినీతి, అప్పులో తెలంగాణ నెంబర్ వన్

అవినీతి, అప్పులో తెలంగాణ నెంబర్ వన్

కేసీఆర్ నియంతృత్వ, కుటుంబ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. అదిలాబాద్ లో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతిపక్షాలను తొక్కేసి రాష్ట్రంలో ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉండాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల విజయమే మోడీ సుపాలనకు నిదర్శనమన్నారు. బీజేపీకి బలమైన కార్యకర్తలున్నారన్న వివేక్..తమ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలే కోరుకుంటున్నారని చెప్పారు. బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. కేసీఆర్ పాపులారిటీ తగ్గడంతోనే పీకే ను సలహాదారునిగా నియమించుకున్నారని ఎద్దేవా చేశారు. అబద్ధాల చక్రవర్తి అనే బిరుదు కేసీఆర్ కి బాగా సెట్ అవుతుందన్నారు. అవినీతి, అప్పులో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని..60వేల కోట్ల అప్పులను 5 లక్షల కోట్ల అప్పులుగా మార్చిన ఘనత టీఆర్ఎస్ కే దక్కుతుందని మండిపడ్డారు. మోడీని గద్దె దించుతానని మాట్లాడుతూ కేసీఆర్ ప్రతిసారి అభాసుపాలవుతున్నారని దుయ్యబట్టారు. కేంద్రానికి సంబంధించిన చాలా పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాల్లో వేలకోట్లు దండుకున్నారని ఆరోపించారు.