ఎర్రవల్లి, మర్కూక్‌ రైతువేదికలకు సీఎం శంకుస్థాపన

ఎర్రవల్లి, మర్కూక్‌ రైతువేదికలకు సీఎం శంకుస్థాపన

సిద్దిపేట : కొండపోచమ్మ గుడిలో చండీయాగం పూర్ణాహుతి తర్వాత.. సీఎం కేసీఆర్.. ఎర్రవెల్లి, మర్కూక్ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. స్థానిక రైతులను పలకరించిన కేసీఆర్.. రైతు వేదికల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇక్కడనుంచి సీఎం నేరుగా.. మర్కూక్ పంప్ హౌజ్ కు చేరుకుంటారు.  పంప్ హౌజ్ దగ్గర సుదర్శనయాగం పూర్ణాహుతిలో చినజీయర్ స్వామితో కలిసి పాల్గొంటారు. కాళేశ్వరంప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 2 భారీ లిఫ్ట్ మోటార్లను స్విచ్చాన్ చేస్తారు. గోదావరి జలాలను కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ లోకి విడుదల చేస్తారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెళ్లి పేరుతో యువ‌కుడికి వ‌ల‌.. రూ.65 ల‌క్ష‌లు నొక్కేసి..