కొత్త రెవిన్యూ చట్టం తీసుకురావాలని నిర్ణయించిన క్రమంలో గ్రౌండ్ లెవల్లో భూపరిపాలనలో ప్రత్యక్ష సంబంధం కలిగిన కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకోవాలని భావించారు సీఎం కేసీఆర్. దీనికి సంబంధించి సీఎం క్యాంపు ఆఫీసులో కలెక్టర్లతో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్.
అవినీతికి ఆస్కారం లేని.. ప్రజలకు , రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చట్టం ఉండాలంటే ఎలాంటి నిబంధనలు రూపొందించాలనే అంశంపై కలెక్టర్ల సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. క్షేత్ర స్థాయిలో తమ అనుభవంలో ఉన్న విషయాలను , కొత్త చట్టం రూపకల్పనలో సూచనలను కలెక్టర్లందరి నుండి తీసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
కొత్త మున్సిపల్ చట్టం , కొత్త పంచాయతీ రాజ్ చట్టం అమలు పై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. పల్లెలు , పట్టణాల్లో అమలు చేయబోయే 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై కూడా చర్చిస్తారు .రెండు రోజుల పాటు కలెక్టర్ల సమావేశం కొనసాగనుంది.