జూన్ 15 నుంచి రైతు బంధు

 జూన్ 15 నుంచి రైతు బంధు

హైద‌రాబాద్: జూన్ 15 నుంచి 25వ తేదీ లోపల రైతు బంధు సాయాన్ని రైతుల‌కు అంద‌జేయ‌నున్న‌ట్లు తెలిపారు సీఎం కేసీఆర్. పంటసాయం కింద ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని ఎప్ప‌టిలాగే రైతుల ఖాతాల్లో జమచేయాలని సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ఇప్పటిదాకా ఇచ్చిన కేటగిరీల వారిగానే రైతు బంధు సాయాన్ని ఖాతాలో వేయాలన్నారు. జూన్ 10 వ తేదీని కటాఫ్ డేట్ గా పెట్టుకోని, ఆ తేదీ వరకూ పార్ట్ బీ నుంచి పార్ట్ ఏలోకి చేరిన భూములకు రైతు బంధు వర్తింప జేయాలని సీఎం ఆదేశించారు.

వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న క్ర‌మంలో  సీఎం కేసీఆర్ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశించారు. జిల్లాల వ్యాప్తంగా కల్తీ విత్తన తయారీదారుల మీద దాడులు జరపాలని, కల్తీ విత్తనదారులను వలవేసి పట్టుకోవాలని, ఎంత వారినైనా ఉపేక్షించ వద్దని ఆదేశించారు. వారిపై పీడీ యాక్టు మోపి, అరెస్ట్ చేయాలని సూచించారు. చిత్తశుద్ధితో పనిచేసి కల్తీ విత్తన విక్రయ ముఠాలను పట్టుకున్న పోలీసు అధికారులకు ప్రమోషన్లు, రాయితీలు, సేవా పతకం కూడా అందజేయాలని అధికారులను కోరారు. ఈ మేరకు తక్షణమే పోలీసులను రంగంలోకి దింపాలని అధికారుల‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.