అంబేద్కర్ జయంతి రోజున ప్రతి ఏడాది అవార్డులను ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంబేద్కర్ అవార్డుల కోసం రూ. 51కోట్లు డిపాజిట్ చేస్తామని చెప్పారు. డిపాజిట్ తో వచ్చే రూ.3 కోట్ల డబ్బులతో ఆవార్డులు ఇస్తామని తెలిపారు. ఏటా అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఉత్తమ సేవలు అందించే వారికి ఈ అవార్డలు ఇస్తామన్నారు.
హైదరాబాద్ లోని ట్యాంక్బండ్ వద్ద బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహన్ని అవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొన్నారు. అంబేద్కర్ విశ్వమానవుడు అని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా అణగారిన వర్గాలకు ఆశాదీపం అని అన్నారు. అంబేద్కర్ జయంతిని జరుపుకోవడమేనా ఆయన ఆశాయాలను సాధించోద్దా అని ప్రశ్నించారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దే అధికారమని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఊహించని స్పందన వస్తోందని యూపీ, బిహార్ లో కూడా ఆదరణ వస్తుందని తెలిపారు. విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ ఉన్నాతాధికారులు పాల్గొన్నారు.