ములాయం అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం కేసీఆర్

ములాయం అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం కేసీఆర్

సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ఇవాళ అధికార లాంఛనాలతో జరగనున్నాయి. మధ్యాహ్నం 3గంటలకు ములాయం స్వగ్రామమైన సైఫాయ్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని సోమవారం స్వగ్రామానికి తరలించారు. తమ అభిమాన నేత కడసారి చూపుల కోసం యూపీలోని వివధ ప్రాంతాల నుంచి జనం తరలి వస్తున్నారు. ములాయం అంత్యక్రియలకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పలువురు ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలు హాజరుకానున్నారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేలు నేతాజీకి తుది వీడ్కోలు పలికేందుకు యూపీ వెళ్లనున్నారు. 

ములాయం సింగ్ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన సైఫాయ్కు చేరుకోనున్నారు. అంత్యక్రియలు ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి సాయంత్రం ఢిల్లీకి చేరుకోనున్నారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు.