ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్

ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్

ఢిల్లీలోని ఎస్పీ మార్గ్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సందర్శించారు. మధ్యాహ్నం 1.38 గంటలకు ఆఫీస్కు  చేరుకున్న ఆయన తన ఛాంబర్లో ఎంపీలు, పలు రాష్ట్రాల రైతు సంఘాల నేతలతో కాసేపు చర్చించారు. అనంతరం కార్యాలయం రెండో అంతస్థులో ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ హాల్ తో పాటు పలువురికి కేటాయించిన ఛాంబర్లను పరిశీలించారు. కార్యాలయంలో చేయాల్సిన మార్పులు చేర్పులకు సంబంధించి పలు సూచనలు చేశారు.  ఆ తర్వాత కేసీఆర్ తనను కలిసేందుకు అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పార్లమెంటరీ పార్టీ నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావుతో పాటు పాటు పలువురు ఎంపీలు సీఎం కేసీఆర్ వెంట ఉన్నారు. 

పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి కుటుంబ సమేతంగా వెళ్లిన కేసీఆర్ నాలుగు రోజులుగా ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. పలువురు నేతలు, పార్టీ కార్యకర్తలతో వివిధ అంశాలపై చర్చిస్తున్నారు. సాయంత్రం ఢిల్లీ పర్యటన ముగించుకుని కేసీఆర్ హైదరాబాద్ కు పయనం కానున్నట్లు తెలుస్తోంది.