కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఎంలా మాట్లాడలేదు: బీజేపీ నేత కృష్ణసాగర్‌‌రావు

కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఎంలా మాట్లాడలేదు: బీజేపీ నేత కృష్ణసాగర్‌‌రావు

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీపై కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఎంలా మాట్లాడలేదని, ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థ సీఈఓలా మాట్లాడారని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు ఆరోపించారు. సీఎం వ్యాఖ్యలు నయా పెట్టుబడిదారి మనస్తత్వాన్ని గుర్తుచేశాయన్నారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. సీఎం కేసీఆర్ బాధ్యతలేకుండా మాట్లాడారని, ప్రజా రవాణాలో ఆర్టీసీని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారన్నారు. మారుమూల పల్లెలకు, పట్టణాలను కలుపుతూ ఆర్టీసీ రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. ప్రస్తుత ఆర్టీసీ టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధరలతో ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆపరేటర్లు బస్సులను నడపడం సాధ్యం కాదన్నారు. ఆర్టీసీకి ఎండీని, చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియమించకుండా సీఎం తన బాధ్యతల్ని పూర్తిగా విస్మరించారన్నారు. ప్రజా రవాణాను ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోటారు వాహన సవరణ చట్టంలో ఉద్యోగులను తొలగించమని గానీ, ఆర్టీసీ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మూసి వేయమని గానీ చెప్పలేదన్నారు. దీనిపై కూడా సీఎం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

CM KCR was spoke irresponsibly: BJP leader Krishnasagar Rao