ఢిల్లీకి బయలుదేరిన సీఎం కేసీఆర్..

ఢిల్లీకి బయలుదేరిన సీఎం కేసీఆర్..

సీఎం కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరారు. ప్రగతిభవన్ నుంచి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన.. కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో  ఢిల్లీకి బయలుదేరారు.  వసంత విహార్ లోని బీఆర్ఎస్ సెంట్రల్ ఆఫీసును మే 04 గురువారం రోజున  మధ్యాహ్నం 1:05 గంటలకు సీఎం ప్రారంభించనున్నారు. అంతకుముందు ఆయన మధ్యాహ్నం 12:30 గంటలకు ఏర్పాటుచేసిన యాగశాల, సుదర్శనపూజ, హోమం, వాస్తుపూజల్లో పాల్గొంటారు. 

కార్యాలయాన్ని ప్రారంభించిన తరువాత మొదటి అంతస్థులోని తన చాంబర్‌కు చేరుకుంటారు. అనంతరం పార్టీ సమావేశపు హాలులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో దాదాపు గంటసేపు తొలి సమావేశం నిర్వహించనున్నారు.  ఇప్పటికే పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన  వేడుకల ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌దగ్గరుండి పర్యవేక్షించారు.  

2021, సెప్టెంబర్ 2న ఆఫీసు నిర్మాణానికి కేసీఆర్ భూమి పూజ చేశారు. మొత్తం 11వేల చదరపు అడుగుల స్థలంలో బిల్డింగ్ నిర్మించారు. జీ ప్లస్​3 ఫ్లోర్లు కలిగిన ఈ బిల్డింగ్​లో మొత్తం 20 రూంలు ఉంటాయి. అంతేకాకుండా, స్పెషల్​గా రెండు సూట్​ రూంలు కూడా నిర్మించారు. ఫస్ట్​ ఫ్లోర్​లో కేసీఆర్ ఆఫీస్, ఆయనకు స్పెషల్​ సూట్​ రూం కేటాయించారు. అలాగే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం మరో సూట్ రూంను ఏర్పాటు చేశారు.  మొత్తం: రూ. 8.64 కోట్లతో సెంట్రల్ ఆఫీసును నిర్మించారు.