ఈనెల 31న సీఎం కేసీఆర్ బీహార్ లో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పాట్నాకు వెళ్లనున్నారు. గతంలో ప్రకటించినట్లుగా గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన ఐదుగురు సైనికుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించనున్నారు.
అదేవిధంగా సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్నిప్రమాదంలో చనిపోయిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు సీఎం ఆర్థిక సాయం అందజేయనున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ తో కలిసి కేసీఆర్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం జాతీయ రాజకీయాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు.