రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ సింఘ్వి, వేంనరేందర్ నామినేషన్

రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ సింఘ్వి, వేంనరేందర్  నామినేషన్

 తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధ ర్ బాబు నేతృత్వంలో వారిద్దరూ నామినేషన్లు వేశారు. సీఎం రేపంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి మూడో సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు 

సిట్టింగ్ ఎంపీగా ఉన్న అభిషేక్ మను సింఘ్వీ పేరును కాంగ్రెస్ అధినాయకత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. రెండోస్థానంపై రాత్రి క్లారిటీ వచ్చింది. చర్చలు, సం ప్రదింపుల తర్వాత వేం సరేందర్రెడ్డి పేరుసు ఖరారు చేశారు. ఈయనకు రాజ్యసభ అభ్యర్థి త్వం ఖరారు చేయాలని ముఖ్యమంత్రి రేవం త్రెడ్డి గట్టిగా కోరడం, అందరితో సన్నిహిత సంబంధాలుండే నరేందర్రెడ్డి పేరుపై ఎవరి నుంచీ అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో అధిష్ఠానం కూడా చివరకు సీఎం మాటకే ప్రా ధాన్యం ఇచ్చింది. ఇందులో మొదటి స్థానాని కి అభిషేక్ సింఘ్వీ ఎన్నికకు ఎలాంటి సమస్య లేదు. రెండో స్థానానికి అవసరమైన మెజార్టీ కాంగ్రెస్కు లేదు. ఎంఐంఎంపై ఆధారపడాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ తరఫున ఎవరూ పోటీ లేకుంటే ఎన్నిక ఏకగ్రీవమవుతుంది.