కొడంగల్ లో నేడు సీఎం రేవంత్​ సభ

కొడంగల్ లో నేడు సీఎం రేవంత్​ సభ
  •     రూ.4,324  కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కోస్గి, వెలుగు: సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎనుముల రేవంత్ రెడ్డి మొదటి సారి తన ఇలాఖాలో అడుగు పెట్టనున్నారు. కొడంగల్ నిమోజకవర్గంలో కోస్గిలో రూ.4,324 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. ‘కొడంగల్–-నారాయణపేట’ స్కీం పనులు ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కోస్గిలోని కొడంగల్​ రోడ్డులో నిర్వహించే బహిరంగ సభలో రేవంత్​ పాల్గొంటారు. ఈ మేరకు ఆఫీసర్లు ఏర్పాట్లు పూర్తి చేశారు.