
విద్యావ్యవస్థలో మార్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జూన్ 13న విద్యాశాఖ అధికారులతో రివ్యూ చేసిన సీఎం రేవంత్.. ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పెంపే తమ లక్ష్యమనన్నారు.నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు.
విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు,ఉపాధ్యాయులకు ట్రైనింగ్, ఇతర సదుపాయాల కల్పనకు ఎంత ఖర్చైనా వెనుకాడొద్దు. రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలు ప్రారంభిస్తున్నాం.విద్యార్థులకు భాషా పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాల పెంపునకు విద్యా వ్యవస్థను మార్పు చేయాలి. హై స్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కల్పిస్తే భవిష్యత్ లో తమకు ఇష్టమైన రంగంలో రాణించే అవకాశం ఉంటుంది.
విద్యాశాఖ,పురపాలక శాఖతో సమన్వయం చేసుకుని హెచ్ఎండీఏ,మున్సిపల్ లే అవుట్ లలో సామాజిక వసతుల కోసం గుర్తించిన స్థలాల్లో స్కూళ్లు ఏర్పాటు చేయాలి. నాణ్యమైన భోజనం, యూనిఫాంలు,పాఠ్యపుస్తకాలు అందిస్తుండటంతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గుచూపుతున్నారు. డే స్కాలర్స్ కు క ఆ పాఠశాలల్లోనే అవన్నీ అందించే విషయంపై అధ్యాయనం చేయాలి.పిల్లలకు కుటుంబం,సమాజం పట్ల బాధ్యయతను తెలియజేసేలా కౌన్సిలింగ్ ఇప్పిస్తే వారు మానసికంగా ధృడంగా తయారవడంతో పాటు బాధ్యతగల పౌరులుగా రాణిస్తారని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు.