కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు గ్యారంటీలకు శ్రీకారం చుట్టింది. సెక్రటేరియట్ లో 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి. పేదలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్ దేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆనాడు దీపం పథకం కింద మహిళలకు రూ. 400 లకే కాంగ్రెస్ గ్యాస్ సిలిండర్ ఇచ్చిందన్నారు. బీజేపీ వచ్చాక గ్యాస్ సిలిండర్ ధర రూ.1200 లకు పెరిగింది.. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా రూ. 500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని చెప్పారు రేవంత్. తాము ఇచ్చిన హామీలను నమ్మే ప్రజలు కాంగ్రెస్ కు ఓటేశారు..ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు.
మాటిస్తే కాంగ్రెస్ వెనకడుగు వేయబొదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సోనియా గాంధీ మాటిస్తే అది శిలాశాసనమని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు.పేదల ఇండ్లలో వెలుగులు నింపుతున్నామన్నారు. చేవెళ్లలో లక్షమంది మహిళల ముందు రెండు గ్యారంటీలను ప్రారంభించాలనుకున్నాం కానీ .. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల చేవేళ్లలో ప్రారంభించలేకపోయామన్నారు రేవంత్. అందుకే సెక్రటేరియట్ లో రెండు గ్యారంటీలను ప్రారంభిస్తున్నామని చెప్పారు.
ఆర్థికంగా నియంత్రణ పాటిస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు రేవంత్. నూటికి నూరుశాతం గ్యారంటీలు అమలు చేస్తాం.. ఎవరెన్ని ఎలాంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని సూచించారు దేశంలో తెలంగాణ నమూనా తీసుకొస్తామని తెలిపారు.