
హైదరాబాద్, వెలుగు: జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా.. దేవునిపై విశ్వాసంతో జీవించాలనే గొప్ప సందేశాన్ని బక్రీద్ ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. తమకు ఉన్న దాంట్లో నుంచే ఇతరులకు పంచి పెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని ఈ పండుగ చాటి చెపుతోందని అభిప్రాయపడ్డారు. బక్రీద్ త్యాగానికి ప్రతీక అని.. దాని ద్వారా శాంతి, సామరస్యం, సహకారం, కరుణ, ఐక్యత సమాజంలో నెలకొనాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.