కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే... కరెంట్ కట్ చేస్తున్రు : సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే... కరెంట్ కట్ చేస్తున్రు : సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం  చేయాలని కొందరు కావాలనే కరెంట్ బంద్ చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కారణం లేకుండా కరెంట్ కట్ చేస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆదివారం మీట్ ది మీడియా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..  "గత ప్రభుత్వం కంటే ఎక్కువ కరెంట్ ఇస్తున్నాం. అక్కడక్కడ కరెంట్ తీస్తున్నారని మా దృస్టికి వచ్చింది.. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.  మా ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. 

కాంగ్రెస్, బీజేపీ కుట్రలను తిప్పి కొడుతాం. కుక్క కాటుకు చెప్పు దెబ్బ తప్పదు.  కేసీఆర్ కుటుంబం రూ.వేల కోట్ల అవితీకి పాల్పడింది. అక్రమార్కులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి  కారణంగా రాష్ట్రంలో అనేక భూసమస్యలు ఉన్నాయి. వాటి పరిష్కరాలకు చర్యలు చేపట్టాం. గతంలో ప్రైవేట్ సంస్థ చేతిలో ధరణి పోర్టల్ ఉండేది.. ఇప్పుడు ప్రభుత్వ చేతిలోకి వచ్చింది. 5 ఎకరాల లోపు ఉన్న వారందరికీ రైతు బందు పడింది" చెప్పారు.