సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

కోస్గి, వెలుగు: ఈ నెల 18న కోస్గి పట్టణానికి సీఎం రేవంత్​రెడ్డి రానున్నారు. స్థానిక గవర్నమెంట్​ జూనియర్  కాలేజీలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం తాండూరు రోడ్డులోని లక్ష్మీనరసింహ ఫంక్షన్​ హాలులో ఆఫీసర్లతో జరిగే రివ్యూ మీటింగ్​లో పాల్గొంటారు.

బహిరంగసభలో ప్రసంగించనుండగా,  బుధవారం కలెక్టర్  కోయ శ్రీహర్ష, ఎస్పీ యోగేశ్​గౌతమ్  అధికారులతో కలిసి పర్యటన ఏర్పాట్లను, హెలీప్యాడ్  స్థలాన్ని పరిశీలించారు. వారి వెంట అడిషనల్​ కలెక్టర్  అశోక్​కుమార్, తహసీల్దార్  శ్రీనివాసులు, సీఐ సోమ నర్సయ్య, మున్సిపల్​ కమిషనర్  చికినె శశిధర్  పాల్గొన్నారు.