హైదరాబాద్, వెలుగు : థైమస్ గ్రంథి తొలగింపు శస్త్రచికిత్స (థైమెక్టమీ) చేయించుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంత్రిని సీఎం ఆదివారం కలిసి, ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
కాగా, ఇటీవల రోబోటిక్ టెక్నాలజీ ద్వారా కోమటిరెడ్డికి డాక్టర్లు థైమెక్టమీ ఆపరేషన్ చేశారు. సీఎం రేవంత్తో పాటు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి తదితరులు ఉన్నారు.