ఇయ్యాల్నే ఆలిండియా బిల్డర్స్ కన్వెన్షన్... ప్రారంభించనున్న సీఎం

ఇయ్యాల్నే ఆలిండియా బిల్డర్స్ కన్వెన్షన్... ప్రారంభించనున్న సీఎం

హైదరాబాద్, వెలుగు :  బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బిఏఐ) నిర్వహించే ఆలిండియా బిల్డర్స్ కన్వెన్షన్​ను  (ఏఐబీసీ)ను ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి శనివారం ప్రారంభించనున్నారు. ‘సస్టెయినింగ్​న్యూ రిజైలెంట్​ ఇండియా’ అనే థీమ్​తో ఈ సదస్సు ఈ నెల 29 వరకు జరుగనుంది.  గెస్టులుగా రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరవుతారని అసోసియేషన్ నేషనల్ ​ ప్రెసిడెంట్​ ఎస్.యన్.రెడ్డి, మాజీ నేషనల్ ​ప్రెసిడెంట్ బొల్లినేని శీనయ్య,  స్టేట్ ​ప్రెసిడెంట్​ దేవేందర్ రెడ్డి తెలిపారు.

 28న నిర్వహించే సాంకేతిక విభాగం సమావేశానికి ఉప–ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చీఫ్​గెస్టుగా వస్తారు.  సదస్సు ముగింపు కార్యక్రమానికి కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చీఫ్​ గెస్ట్​గా, కేంద్ర సమాచారశాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్​ చౌహాన్ గౌరవ అతిథిగా వచ్చి ప్రసంగిస్తారు. 800   మందికిపైగా హాజరవుతున్న ఈ సదస్సులో  నిర్మాణ రంగంలో అధునాతన టెక్నాలజీ వంటి పలు అంశాలపై సెమినార్లు, టెక్నికల్ సెషన్స్ జరుగుతాయి.