హైదరాబాద్, వెలుగు : బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బిఏఐ) నిర్వహించే ఆలిండియా బిల్డర్స్ కన్వెన్షన్ను (ఏఐబీసీ)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించనున్నారు. ‘సస్టెయినింగ్న్యూ రిజైలెంట్ ఇండియా’ అనే థీమ్తో ఈ సదస్సు ఈ నెల 29 వరకు జరుగనుంది. గెస్టులుగా రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరవుతారని అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ ఎస్.యన్.రెడ్డి, మాజీ నేషనల్ ప్రెసిడెంట్ బొల్లినేని శీనయ్య, స్టేట్ ప్రెసిడెంట్ దేవేందర్ రెడ్డి తెలిపారు.
28న నిర్వహించే సాంకేతిక విభాగం సమావేశానికి ఉప–ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చీఫ్గెస్టుగా వస్తారు. సదస్సు ముగింపు కార్యక్రమానికి కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చీఫ్ గెస్ట్గా, కేంద్ర సమాచారశాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ గౌరవ అతిథిగా వచ్చి ప్రసంగిస్తారు. 800 మందికిపైగా హాజరవుతున్న ఈ సదస్సులో నిర్మాణ రంగంలో అధునాతన టెక్నాలజీ వంటి పలు అంశాలపై సెమినార్లు, టెక్నికల్ సెషన్స్ జరుగుతాయి.