గోపూజ మహోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్‌

గోపూజ మహోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్‌

ఏపీ గుంటూరు జిల్లా నరసరావుపేటలో పర్యటిస్తున్నారు ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా టీటీడీ,  దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు జగన్. నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ఆయన పరిశీలించారు.  రైతులకు, ఏపీ ప్రజలకు జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలపారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వేద పండితులు పాల్గొన్నారు.