వైఎస్సార్‌ లా నేస్తం.. ఏపీలో తప్ప ఎక్కడా ఈ పథకం లేదు : సీఎం జగన్

 వైఎస్సార్‌ లా నేస్తం..  ఏపీలో తప్ప ఎక్కడా ఈ పథకం లేదు  :  సీఎం జగన్

రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 2 వేల 677 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5 వేల స్టైఫండ్‌ చొప్పున 2023–24 సంవత్సరానికి మొదటి విడత ‘వైఎస్సార్‌ లా నేస్తం’ కింద రూ.6.12 కోట్ల రూపాయలను ఏపీ సీఎం జగన్ 2023 జూన్ 26  సోమవారం  రోజున రిలీజ్ చేశారు.  ప్రభుత్వం కొత్తగా లా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన యువ న్యాయవాదులు వృత్తిలో నిలదొక్కుకునేలా మూడేళ్ల పాటు ఏడాదికి రూ.60 వేల చొప్పున రెండు దఫాల్లో చెల్లిస్తూ.. మొత్తం రూ.1.80 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. తాజాగా విడుదల చేస్తున్న ఆర్థిక సాయంతో కలిపి ఇప్పటివరకు 5,781 మంది యువ న్యాయ­వాదులకు రూ.41.52 కోట్లు చెల్లించింది.

వైఎస్సార్ లా నేస్తం పథకం, ఇలాంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో లేదని, కేవలం మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. అడ్వకేట్లకు అన్నిరకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో ఇప్పటికే వెల్ఫేర్ ట్రస్టును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ట్రస్ట్ ద్వారా మెడిక్లెయిం కాని, ఇతరత్రా అవసరాలకు రుణాలు కావొచ్చు. ఈ ఫండ్ నుంచి రూ.25 కోట్లు సహాయం చేయడం జరిగిందన్నారు. న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా నిలిచిందని, ప్రభుత్వం తరఫునుంచి న్యాయవాదులను కోరేది ఒక్కటే..జూనియర్లుగా ఉన్న న్యాయవాదులు ప్రతి ఒక్కరూ కూడా దీనివల్ల మంచి జరిగితే.. వీరు స్థిరపడ్డాక ఇదే మమకారం  పేదలపట్ల విశ్వాసం చూపిస్తారని.. ఒక అన్నగా, ఒక స్నేహితుడిగా వారి దగ్గరనుంచి ఆశిస్తున్నానని చెప్పారు. దీన్ని ఎప్పుడూ మరిచిపోవద్దని సీఎం జగన్ కోరారు. 

ఈ కార్యక్రమం ద్వారా రూ. 6 కోట్ల12 లక్షల 65 మేరకు వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నామని జగన్ చెప్పారు. న్యాయవాదులు ఎవరైనా కూడా లా కోర్స్ కంప్లింట్ చేసి మొదటి మూడు సంవత్సరాలు ప్రాక్టిస్ లేని పరిస్థితిలో వారి కాళ్లపై వారు నిలబడేందుకు వారికి తోడుగా నిలుస్తూ ప్రతి నెల రూ.5 వేల చొప్పున, ఏడాదికి రూ.60 వేలు వారి చేతుల్లో డబ్బు ఉంటే..ఈ మూడేళ్లు ప్రతి ఏటా రూ.60 వేల చొప్పున మూడేళ్లలో రూ.1.80 లక్షలకు వారికి తోడుగా ఉంటే వృత్తిలో ఇబ్బందులు లేకుండా మంచి జీవితంలో నెట్టుకురాగలుగుతారన్నారు.