జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి: సీఎం రేవంత్

జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి: సీఎం రేవంత్

న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం (జూలై 8) ఢిల్లీలోని వాణిజ్య భ‌వ‌న్‌లో కేంద్ర వాణిజ్య, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌‎ను కలిశారు. ఈ సందర్భంగా జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (ZISC) అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని గోయల్‎కు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పలు కీలక ప్రాజెక్టుల విషయంపై చర్చించారు. 

జ‌హీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, అమ‌లు కార్యక్రమం (NICDIT) కింద ఆమోదించిన ₹ 596.61 కోట్లను సత్వరం విడుద‌ల చేయాల‌ని కోరారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి అవ‌స‌ర‌మైన నీటి స‌ర‌ఫ‌రా, విద్యుత్, ఇత‌ర వ‌స‌తుల క‌ల్పన‌కు ఆర్థిక స‌హాయం చేయాల‌ని విజ్ఞప్తి చేశారు. 

ALSO READ | తెలంగాణ వాటా యూరియాను సకాలంలో పంపండి: నడ్డాకు CM రేవంత్ రిక్వెస్ట్

హైద‌రాబాద్‌ - వ‌రంగ‌ల్ పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా వ‌రంగ‌ల్ విమానాశ్రయానికి నిధులు మంజూరు చేయాల‌ని అభ్యర్ధించారు. హైద‌రాబాద్‌ - విజ‌య‌వాడ పారిశ్రామిక కారిడార్ ఫీజుబిలిటీని అధ్యయ‌నం చేస్తున్నట్లు కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి వివరించారు.తెలంగాణ ప్రభుత్వం ఆదిభ‌ట్లలో అత్యున్నత‌మైన మౌలిక వ‌స‌తుల‌తో ప్రత్యేక‌మైన ర‌క్షణ‌, ఏరోస్పేస్ పార్క్‌ను ఏర్పాటు చేసింద‌ని వివరిస్తూ, హైద‌రాబాద్‌ - బెంగ‌ళూర్ పారిశ్రామిక కారిడార్‌ను ఏరో-డిఫెన్స్ కారిడార్‌గా మంజూరు చేయాల‌ని సీఎం రేవంత్ రిక్వెస్ట్ చేశారు. 

పెట్టుబ‌డుల‌కు సిద్ధంగా ఉన్న వంద ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాద‌న‌లు స‌మ‌ర్పిస్తామ‌ని, కేంద్ర ప్రభుత్వం వాటికి మ‌ద్దతుగా నిల‌వాల‌నిగోయల్‎ను‎ కోరారు. ఈ స‌మావేశంలో సీఎం రేవంత్‎తో పాటు రాష్ట్ర ప్రభుత్వ స‌ల‌హాదారు ఏపీ జితేంద‌ర్ రెడ్డి, ఎంపీలు డాక్టర్ మ‌ల్లు ర‌వి ,  చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.