
కొడంగల్, వెలుగు: ప్రభుత్వం ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీ జరగని రైతుల వివరాలను వ్యవసాయశాఖ అధికారులు సేకరిస్తున్నారు. అర్హత ఉండి రుణమాఫీ జరగని రైతు కుటుంబ సభ్యుల నిర్ధారణ కోసం ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు ఏడీఏ శంకర్ రాథోడ్తెలిపారు. కొడంగల్మండలం రావులపల్లిలో శుక్రవారం పలు ఇళ్లకు వెళ్లి సమాచారాన్ని యాప్లో నమోదు చేశారు.