పోలింగ్ విధులు సమర్థంగా నిర్వహించాలి :  కలెక్టర్అనుదీప్దురిశెట్టి 

పోలింగ్ విధులు సమర్థంగా నిర్వహించాలి :  కలెక్టర్అనుదీప్దురిశెట్టి 

ఖమ్మం రూరల్, వెలుగు: మున్సిపల్ పోలింగ్​విధులు సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్​అనుదీప్​దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం పెద్దతండాలోని ప్రియదర్శిని కళాశాలలో ఏర్పాటు చేసిన ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఎన్నికల సిబ్బందికి పోలింగ్​సామగ్రి పంపిణీపై సూచనలు చేశారు.

పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బ్యాక్సులకు సీలింగ్, స్ట్రాంగ్ రూమ్​కు తరలింపు తదితర అంశాలపై పూర్తి అవగాహన ఉండాలని చెప్పారు. స్ట్రాంగ్​రూమ్​వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఉండాలని, కౌంటింగ్ సెంటర్ల వద్ద నిబంధనలు పాటించాలని సూచించారు. రిటర్నింగ్ ఆఫీసర్​ నవీన్ బాబు,  మున్సిపల్ కమిషనర్ మున్వర్ అలీ, కళాశాల యాజమాన్యం నవీన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి

ఖమ్మం టౌన్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస్​రెడ్డితో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.  

ఆర్థిక అంశాల్లో అప్రమత్తంగా ఉండాలి 

ఆర్థిక అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు కలెక్టరేట్ లో సోమవారం ఆర్థిక అక్షరాస్యతపై రూపొందించిన వాల్​పోస్టర్​ ఆవిష్కరించారు. ప్రతీ పౌరుడికి ఆర్థిక అక్షరాస్యతపై, ఆన్​లైన్ ​మోసాలపై అవగాహన ఉండాలని చెప్పారు. డీఆర్వో పద్మశ్రీ, జడ్పీ సీఈవో దీక్ష రైనా, ఎల్డీఎం రవిప్రసాద్, టీజీబీ రీజినల్ మేనేజర్ ప్రసన్న కుమార్, ఎస్​బీఐ చీఫ్ మేనేజర్ శ్రీరామ్ బరన్ తదితరులు పాల్గొన్నారు.