గిట్టుబాటు ధరకే ధాన్యం అమ్ముకోవాలి : రాహుల్​రాజ్​

గిట్టుబాటు ధరకే ధాన్యం అమ్ముకోవాలి : రాహుల్​రాజ్​

మెదక్​టౌన్, వెలుగు: కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతులు గిట్టుబాటు ధరకే అమ్ముకోవాలని కలెక్టర్​రాహుల్​రాజ్​ సూచించారు. ఆదివారం ఆయన మెదక్, మాచవరం ఫ్యాక్స్​కొనుగోలు కేంద్రాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ  సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం  తూకంలో పారదర్శకంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. 

గ్రేడ్-ఏ రకానికి రూ.2,203,  గ్రేడ్-బి  రకానికి రూ.2,183. మద్దతు ధర నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో  బుక్స్ నిర్వహణ,  గన్నీ బ్యాగులు, రైతులకు కల్పించిన వసతులను పరిశీలించారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఏ విధంగా తీసుకురావాలో అవగాహన కల్పించాలన్నారు.  రైతులకు భరోసా కల్పిస్తూ  ఎప్పటికప్పుడు సమాచారాన్ని వాట్సాప్​ ద్వారా తెలుసుకొని చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.