
గద్వాల, వెలుగు: భారత్ మాల రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందిస్తామని కలెక్టర్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో భూములు కోల్పోయిన రైతులతో కలెక్టర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 55 కిలోమీటర్ల పొడవున భారత్ మాలలో రోడ్డు నిర్మాణం చేపట్టామన్నారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 70 నుంచి 80 శాతం పనులు కంప్లీట్ అయ్యాయన్నారు.
భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. పరిహారం పెంచే విషయమై ఎన్ హెచ్ఎఐ ఆఫీసర్లతో చర్చలు జరుపుతున్నామన్నారు. తప్పకుండా రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, రైతులుపాల్గొన్నారు.