నాగర్ కర్నూల్ జిల్లాలో భూసేకరణ ప్రక్రియపై దృష్టిపెట్టాలి : కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్ కర్నూల్ జిల్లాలో భూసేకరణ ప్రక్రియపై దృష్టిపెట్టాలి : కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జిల్లాలోని ప్రాజెక్టులకు భూసేకరణ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం, పాలమూరు రంగారెడ్డి, మార్కండేయ ఇరిగేషన్, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లపై రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియలను స్పీడప్‌‌‌‌‌‌‌‌ చేయాలని రెవెన్యూ, నీటిపారుదల అధికారులను ఆదేశించారు.

ప్రాజెక్టులు, డిస్ట్రిబ్యూషన్ కెనాల్ వారీగా రెవెన్యూ సర్వేయర్, ఇరిగేషన్ అధికారులతో కూడిన ప్రత్యేక టీమ్‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేసి సర్వే చేయాలన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి జిల్లా పరిధిలోని 14 ప్యాకేజీల పరిధిలో 11,930.22 ఎకరాల భూసేకరణ కావలసి ఉండగా ఇప్పటివరకు 11,899.07 ఎకరాల సేకరణ పూర్తయిందని, ఇంకా 31.15 ఎకరాలు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉందన్నారు.

మహాత్మా గాంధీ ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోని 28వ ప్యాకేజీకి 3,907 ఎకరాలు అవసరముండగా మరో 27 ఎకరాలు, 29వ ప్యాకేజీకి 8,936 ఎకరాలకు గానూ మరో 242 ఎకరాలు, 30వ ప్యాకేజీకి 5,327 ఎకరాలకు గానూ 256 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉందన్నారు. మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ అధికారులు శ్రీధర్, పార్థసారథి, మురళి, జిల్లా ల్యాండ్‌‌‌‌‌‌‌‌ సర్వే అధికారి నాగేందర్, ఆర్డీవోలు శ్రీను, మాధవి, సురేశ్‌‌‌‌‌‌‌‌, భూసేకరణ విభాగం కలెక్టరేట్ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ నారాయణ, కార్తీక్ రావు, అధికారులు పాల్గొన్నారు.