అంకితభావంతో పని చేయాలి

అంకితభావంతో పని చేయాలి

నారాయణపేట, వెలుగు: కొత్తగా నియామకమైన సంక్షేమ వసతి గృహ అధికారులు అంకితభావంతో విధులు నిర్వహించాలని కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ అన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కొత్తగా నియమితులైన జిల్లాలోని షెడ్యూల్డు కులాల అభివృద్ధిశాఖ పరిధిలోని ఎస్సీ వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న ఆరు వసతిగృహాలకు ఆరుగురు వసతి సంక్షేమ అధికారులు శుక్రవారం విధుల్లో చేరారు. మర్యాదపూర్వకంగా కలెక్టర్​ను కలిశారు. కార్యక్రమంలో సంక్షేమ అధికారి ఉమాపతి ఉన్నారు. అనంతరం జిల్లాకు కొత్తగా వచ్చిన జిల్లా జడ్జి బోయ శ్రీనివాసులుని కోర్టులో కలెక్టర్​ మర్యాదపూర్వకంగా కలిశారు.