ఎంసీఎంసీ సెంటర్ ​ప్రారంభించిన కలెక్టర్

ఎంసీఎంసీ సెంటర్ ​ప్రారంభించిన కలెక్టర్

మెదక్​టౌన్, వెలుగు: పొలిటికల్​ లీడర్లు ఎలక్షన్ ​కమిషన్​ నిబంధనలు పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​రాహుల్​రాజ్​సూచించారు. శనివారం మెదక్ కలెక్టరేట్​లో అడిషనల్​కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి ఎంసీఎంసీ సెంటర్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని మీడియా సెంటర్ ద్వారా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని అధికారులకు సూచించారు. 

శాటిలైట్ ఛానెల్స్​లో వచ్చే వార్తలను రికార్డు చేయాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై సీ--విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. లేదంటే1950 టోల్ ఫ్రీ ద్వారా సమాచారం అందించాలన్నారు.