ఇబ్రహీంబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన..గడువులోపు పూర్తి చేయాలి : కలెక్టర్ విజయేందిర బోయి 

ఇబ్రహీంబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన..గడువులోపు పూర్తి చేయాలి : కలెక్టర్ విజయేందిర బోయి 

హన్వాడ, వెలుగు:  హన్వాడ మండలం  ఇబ్రహీంబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను కలెక్టర్ విజయేందిర బోయి పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు 91 మంజూరు కాగా.. వాటిలో 6 ఇండ్ల   బేస్మెంట్ పూర్తికాగా, 56 ఇండ్లకు మార్కింగ్ చేసినట్లు అధికారులు వివరించారు.  వాటిలో బేస్మెంట్ కంప్లీట్ అయిన లబ్ధిదారుల ఇంటి దగ్గరికి వెళ్లి కలెక్టర్ పరిశీలించారు.  ఇంటి నిర్మాణం ఎప్పటివరకు పూర్తి చేస్తారని ప్రశ్నించగా.. రెండు నెలల్లో పూర్తి చేస్తామని లబ్ధిదారులు చెప్పారు.  

హన్వాడ మండలం దాచకపల్లిలోని చెంచు కాలనీలో కలెక్టర్ పర్యటించారు. కాలనీ వాసులు 37 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు వినతిపత్రం సమర్పించారు. పంచాయతీ కార్యదర్శి ఎంపీడీవోను వెరిఫై చేయాలని సూచించారు.  జిల్లా కలెక్టర్ వెంట గృహ నిర్మాణ శాఖ పీడీ వైద్యం భాస్కర్, హన్వాడ తహసీల్దార్ కిష్ట్యా నాయక్, ఏఓ కిరణ్ తదితరులున్నారు. 

 రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు 

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలో 2024 –-25 యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి గతేడాది యాసంగి కంటే రికార్డు స్థాయిలో రైతుల నుండి  ధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు.  గత యాసంగి 2023-–24 సీజన్ లో 28 మే  నాటికి 23,926.48 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 4625 మంది రైతులకు 52.71 కోట్లు చెల్లించగా,  2024 –-25లో మే 28 నాటికి 192 ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి 1,39,261 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ. 276 కోట్లు చెల్లించామన్నారు.