వర్షాకాలంలో ప్రజలు సీజినల్ వ్యాధులపై అలర్ట్గా ఉండాలి  : కలెక్టర్‌‌‌‌‌‌‌‌ విజయేందిరబోయి 

వర్షాకాలంలో ప్రజలు సీజినల్ వ్యాధులపై అలర్ట్గా ఉండాలి  : కలెక్టర్‌‌‌‌‌‌‌‌ విజయేందిరబోయి 

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: వర్షాకాలంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌‌‌‌లో ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 96 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో వివిధ సమస్యలపై రివ్యూ మీటింగ్‌‌‌‌ నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్ రావు,  జడ్పీ సీఈవో వెంకట రెడ్డి, డీఆర్‌‌‌‌‌‌‌‌డీవో నర్సింహులు, పాల్గొన్నారు.