
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జిల్లాలో బడి ఈడు పిల్లలను పనుల్లో పెట్టుకుంటే జైలు శిక్ష తప్పదని కలెక్టర్ బదావత్ సంతోష్ హెచ్చరించారు. శుక్రవారం తన ఛాంబర్ లో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం వాల్ పోస్టర్ రిలీజ్ చేశారు. హోటళ్లు, వ్యాపార సంస్థలు, వ్యవసాయ పొలాలు, గృహాల్లో పిల్లలు పని చేస్తున్నట్లు కనిపిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ తో పాటు కార్మిక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాల కార్మికులు కనిపిస్తే 1098, 112 నంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. డీడబ్ల్యూవో రాజేశ్వరి, జిల్లా లేబర్ ఆఫీసర్ రాజ్ కుమార్, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రావు, జిల్లా బాలల సంరక్షణ అధికారి శ్రీశైలం గౌడ్, సఖి కో ఆర్డినేటర్ సునీత, బాలల సమితి కో ఆర్డినేటర్ శ్వేత పాల్గొన్నారు.
భూ సేకరణ స్పీడప్ చేయాలి..
కేఎల్ఐ, పాలమూరు– రంగారెడ్డి, మార్కండేయ, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ స్పీడప్ చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. కలెక్టరేట్ లో రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీసర్లతో అడిషనల్ కలెక్టర్ పి అమరేందర్ తో కలిసి రివ్యూ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, భూసేకరణ కంప్లీట్ చేయాలన్నారు. , రెవిన్యూ, వివిధ ప్రాజెక్టుల నీటిపారుదల శాఖల అధికారులు పాల్గొన్నారు.