రేపు మద్యం షాపులు బంద్ : తరుణ్​జోషి

రేపు మద్యం షాపులు బంద్ : తరుణ్​జోషి

మల్కాజిగిరి, వెలుగు: శ్రీరామనవమిని పురస్కరించుకుని బుధవారం రాచకొండ పోలీసు కమిషనరేట్​పరిధిలోని  మద్యం షాపులు మూసి ఉంటాయని రాచకొండ కమిషనర్​తరుణ్​జోషి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. 

కల్లు దుకాణాలు, వైన్స్​,బార్​అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లు, క్లబ్స్​ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు మూసి వేయాలని, రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.