ఎమ్మెల్యే ఆస్తులపై విచారణ జరిపించాలి

ఎమ్మెల్యే ఆస్తులపై విచారణ జరిపించాలి

యాదాద్రి/ఆలేరు, వెలుగు: భువనగిరి యాదాద్రి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతపై ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టర్(ఈడీ)కి తుర్కపల్లి మండలం గొల్లగూడెం యువకుడు బొడుసు మహేశ్​ ఫిర్యాదు శారు. ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న ఆస్తులకు, ప్రస్తుతం ఉన్న ఆస్తులకు ఎంతో వ్యత్యాసం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐదు ఎకరాల స్థలం ఉందని ఎన్నికల అఫిడవిట్​లో పేర్కొన్నారని, ఇప్పుడు వంద ఎకరాల వరకు ఆస్తులు గడించి, బినామీల పేర్లతో ఉంచారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆస్తులపై విచారణ జరిపించాలని ​ కోరారు.