ఈ ఏడాది సమగ్ర భూ సర్వే.. బడ్జెట్‌లో రూ.400 కోట్లు

ఈ ఏడాది సమగ్ర భూ సర్వే.. బడ్జెట్‌లో రూ.400 కోట్లు

ఈ ఏడాది సమగ్ర భూ సర్వే చేయనున్నట్లు ఆర్థికమంత్రి హరీష్ రావు బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీలో ప్రకటించారు. పక్కాగా భూరికార్డులు తయారు చేయాలనే లక్ష్యంతో డిజిటల్ విధానంలో సమగ్ర భూ సర్వేను ఈ సంవత్సరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సర్వే ఆధారంగా అక్షాంశ, రేఖాంశాలతో సహా స్పష్టమైన హద్దుల వివరాలతో పాస్ బుక్కులను అందించనున్నారు. ఈ సర్వేలో వ్యవసాయ భూములు మాత్రమే కాకుండా వక్ఫ్ భూములు, అటవీ భూములు, దేవాలయ భూములు, ప్రభుత్వ భూముల హద్దుల వివాదాలు కూడా పరిష్కారమవుతాయి. వీటన్నింటి కోసం ఈ వార్షిక బడ్జెట్‌లో రూ. 400 కోట్లు కేటాయించారు.