
- సెక్రటేరియెట్ ముందు 317 జీవో బాధిత స్టాఫ్ నర్సుల ఆందోళన
హైదరాబాద్, వెలుగు: స్థానికతను పరిగణనలోకి తీసుకుని తమకు పోస్టింగ్ ఇవ్వాలంటూ స్టాఫ్ నర్సులు సోమవారం సెక్రటేరియెట్ ముందు నిరసన తెలిపారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోతో దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు వంద మంది స్టాఫ్ నర్సులు ఆందోళన చేపట్టారు.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్య చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలని పోలీసులను కోరారు. ఈనెల 31న రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రిక్రూట్ మెంట్ అయిన స్టాఫ్ నర్సులకు అపాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నదని, వీరు డ్యూటీలో చేరితే లైఫ్ లాంగ్ స్థానికతను కోల్పోయి ఇప్పుడున్న ప్రాంతాల్లోనే జాబ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు.
ప్రజా పాలనలో తమకు న్యాయం చేయాలని కోరారు. కొంత మంది స్టాఫ్ నర్సులను హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ చాంబర్కు వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. దామోదర రాజనర్సింహ సీఎం రేవంత్తో రివ్యూలో ఉండటంతో ఆయన చాంబర్లో వినతిపత్రం అందజేసి.. త్వరగా న్యాయం చేయాలని బాధితులు కోరారు.