ఈ సారి ఓట్లు అడిగితే కొట్టి పంపుతం

ఈ సారి ఓట్లు అడిగితే కొట్టి పంపుతం

హైదరాబాద్ లో వరద బాధితుల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. వినాయక్ నగర్ నుంచి నేరేడ్ మెట్ చౌరస్తా వరకు దాదాపు 300 మంది మహిళల ర్యాలీ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బాధితులకు నష్ట పరిహారం అందే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామన్నారు స్థానిక నేతలు. వినాయక్ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఇంటికి వెళ్లి  పరిహారం గురించి అడిగితే పోలీసులతో తరిమికొడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తే కొట్టి పంపుతామన్నారు.