సీఎం కేసీఆర్ ప్రోగ్రాంలో గర్భిణీల అవస్థలు

సీఎం కేసీఆర్ ప్రోగ్రాంలో గర్భిణీల అవస్థలు

నిమ్స్ ఆసుపత్రి విస్తరణ కార్యక్రమంలో గర్బిణీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నిమ్స్ కొత్త ఆసుపత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమిపూజ నిర్వహించనున్నారు. భూమి పూజ తర్వాత గర్బిణీలకు న్యూట్రీషన్ కిట్లు పంపిణీ చేస్తారు. ఇందుకోసం గర్బిణీలకు సరైన ఏర్పాటు చేయలేదు. గర్బిణీలను స్టేజ్ పైకి పిలిచి దాదాపు 30 నిమిషాల పాటు నిలబెట్టారు. దీంతో వారంతా తీవ్ర అవస్థలు పడ్డారు. స్టేజ్ పైన ఎక్కడ కూర్చొవాలో తెలియక అలాగే నిలబడ్డారు. 5 సార్లు గర్బిణీలను స్టేజ్ ఎక్కించి దింపేశారు. అధికారుల తీరుపై గర్బిణీలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గర్బిణీ అని చూడకుండా తమను అవస్థలకు గురిచేశారని మండిపడ్డారు.