రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్ముకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముర్ము నివాసం దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ముర్ముకు శుభాకాంక్షలు చెప్పేందుకు పలువురు రాజకీయ ప్రముఖులు ఆమె నివాసానికి వెళ్తున్నారు. ముర్మకు ఫ్లవర్ బొకే ఇచ్చి అభినందలు తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఆ తర్వాత కొద్దిసేపు భేటీ అయ్యారు.
Vice President M Venkaiah Naidu meets President-elect Droupadi Murmu at her residence in Delhi pic.twitter.com/nqfcWnVOCF
— ANI (@ANI) July 22, 2022
ముర్ము నివాసంలో ఆమెతో సమావేశమయ్యారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ముర్ముకు వేదపండితుల చేత ఆశ్వీరచనం ఇప్పించారు కిషన్ రెడ్డి. బ్రహ్మకుమారీస్ పెద్దలు ముర్ము నివాసానికి వచ్చి ఆమెకు అభినందలు తెలిపారు. పలు ప్రాంతాలకు చెందిన గిరిజనలు సంప్రదాయ నృత్యాలు చేస్తున్నారు. ముర్ముకు అభినందలు తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించారు.