కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణను ధ్వంసం చేశాయి : మోదీ

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణను ధ్వంసం చేశాయి : మోదీ

గతంలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ లూటీ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని ప్రధాని మోదీ ఆరోపించారు. నాగర్ కర్నూల్ లో బీజేపీ విజయభేరీ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో ప్రజల బతుకులు మారలేదని చెప్పారు. బీజేపీ మెజారిటీ సీట్లు గెలిస్తే కాంగ్రెస్ కు వణుకువస్తుందని విమర్శించారు. రెండు పార్టీలు తెలంగాణను ధ్వంసం చేశాయని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటే అని కాంగ్రెస్ పార్టీ 2జీ స్కాం చేస్తే పాల్పడితే బీఆర్ఎస్ ఇరిగేషన్, భూ దందాలు చేసిందన్నారు.

తెలంగాణలోను కమలం వికసించాలని మోదీ కోరారు. 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. హామి ఇచ్చినట్టు 370ని రద్దు చేశామన్నారు.  అయెధ్యలో రామమందిరం నిర్మించుకున్నామని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని తెలిపారు.  ముద్ర లోన్ లతో 67 లక్షల మంది లబ్ధి పొందారని అన్నారు. తెలంగాణ బీజేపీ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించాలని మోదీ కోరారు.