కలియాచక్: బెంగాల్లో బీజేపీ గెలవడానికి కాంగ్రెస్, సీపీఎం సహాయం చేస్తున్నాయని రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. మోదీ ప్రభుత్వానికీ వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో తాము కీలక పాత్ర పోషిస్తామని చెప్పారు.
మాల్దా జిల్లాలో ‘దీదీ’ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్తో మాకు పొత్తు లేదు. కాంగ్రెస్కు ఇక్కడ సీపీఎంతో పొత్తు ఉంది. ఈ రెండు పార్టీలు బీజేపీతో చేతులు కలిపాయి. ఆ పార్టీలకు ఓటేస్తే బీజేపీ వ్యతిరేక ఓటు శాతాన్ని తగ్గించి.. మోదీ ప్రభుత్వానికి సాయం చేసినట్లే. కాంగ్రెస్, సీపీఎం రాష్ట్రంలో బీజేపీకి రెండు కళ్ల వంటివి” అని మమతా బెనర్జీ ఆరోపించారు.