
- ఎమ్మెల్యే పర్ణికారెడ్డి
మరికల్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే పేదలకు ఇండ్లు మంజూరు చేసిందని నారాయణపేట ఎమ్మెల్యే డా.పర్ణికారెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో అన్ని గ్రామాలకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు.
కల్యాణలక్ష్మీ, సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నియోజకవర్గంలో ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలు ఇస్తున్నామని గుర్తుచేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, పార్టీ నాయకులు సూర్యమోహన్రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.
కందనూలు వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట, పలు గ్రామాల్లో లబ్ధిదారులకు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి మంగళవారం ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎవరైనా డబ్బులు అడిగితే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేద ప్రజలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మండల నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.