క్షమాపణ చెప్పు.. లేదంటే రూ.కోటి దావా వేస్తా

క్షమాపణ చెప్పు.. లేదంటే రూ.కోటి దావా వేస్తా
  • టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మాణిక్కం లీగల్ నోటీస్

హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్ లీగల్ నోటీస్ పంపించారు. మాణిక్కం రూ.25 కోట్లు తీసుకొని రేవంత్ కు పీసీసీ ఇచ్చారని ఈ నెల 3న సుధీర్ రెడ్డి ఆరోపించారు. దీనిపై వారంలోగా రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలని, లేదంటే రూ.కోటి పరువు నష్టం దావా వేస్తామని మాణిక్కం తరఫు లాయర్ అరవిందన్ శనివారం లీగల్ నోటీస్ పంపారు. రేవంత్ ను పీసీసీ చీఫ్ గా పార్టీ ప్రెసిడెంట్ సోనియాగాంధీ నియమించారని.. నేతల అభిప్రాయాలు, వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్నారని అందులో పేర్కొన్నారు. సుధీర్ రెడ్డి చేసిన కామెంట్ మాణిక్కం ఠాగూర్ కు రాజకీయంగా నష్టం కలిగిస్తుందన్నారు.